హామీలను నేరవేర్చుతున్నాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హామీలను నేరవేర్చుతున్నాం

గుంటూరు నవంబర్ 7  (way2newstv.com)
అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో 265 కోట్ల రూపాయిల నిధులు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పామని, ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నానని చెప్పారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు.  అనంతరం  బహిరంగ సభలో మాట్లాడారు. . 10 వేల రూపాయిల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తామని ఆయన చెప్పారు.
హామీలను నేరవేర్చుతున్నాం

'3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తాం. నా పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకున్నాను.తొలి కేబినెట్ లోనే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించామని అయన గుర్తు చేసారు.'గత ప్రభుత్వ పాలనలోనే అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది.. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మేము కేవలం ఐదు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదికి రూ.10 వేలిస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నాం.అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం' అని జగన్ వ్యాఖ్యానించారు.  ఇక ఆ తర్వాతి దశలో రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.