టీడీపీకి తీరని లోటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీకి తీరని లోటు

ఏలూరు, డిసెంబర్ 26  (way2newstv.com)
టీడీపీమాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బడేటి కోట రామారావు(బుజ్జి) కన్నుమూశారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుజ్జికి గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు.బుజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు సంతాపాన్ని తెలియజేశారు. బాబు బుజ్జి కుటుంబ సభ్యుల్ని ఫోన్‌లో పరామర్శించారు.. తన సానుభూతిని తెలియజేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 
టీడీపీకి తీరని లోటు 

మున్సిపల్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి కృషి చేశారని.. ఏలూరును స్మార్ట్‌సిటీగా చేయాలని పరితపించారని.. బుజ్జి మృతి ఏలూరు నియోజకవర్గానికే కాదు.. టీడీపీకి తీరని లోటన్నారు.బుజ్జి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. ఏలూరు ప్రాంత అభివృద్ధి కోసం పరితపించారన్నారు. బుజ్జి ప్రజల మనిషని.. బుజ్జి మృతి పార్టీకి తీరని లోటని.. తన సంతపాన్ని తెలియజేశారు.బడేటి బుజ్జి గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. తర్వాత 2009లో ప్రజారాజ్యంలో చేరి.. ఆ పార్టీ తరపున ఏలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి 2014లో ఏలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో తిరిగి అక్కడ నుంచే పోటీచేసిన ఆయన 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చేతిలో ఓడారు. బడేటి బుజ్జి దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు.