బయట ఫుడ్డే బెస్ట్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బయట ఫుడ్డే బెస్ట్...

వరంగల్, జనవరి 22, (way2newstv.com)
హైదరాబాద్, వరంగల్ అసొంటి పెద్ద పెద్ద పట్నాల నుంచి చిన్న టౌన్లు, మండల కేంద్రాల దాకా ఇదే అలవాటుగ మారింది. పొద్దున టిఫిన్ సెంటర్ల ముందు, మధ్యాహ్నం లంచ్ బండ్ల దగ్గర, సాయంత్రం హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద జనం కిక్కిరిసి కనిపిస్తున్నరు. జనం ఈ తీర్న తింటుండటంతో గల్లీగల్లీల్లో టిఫిన్ సెంటర్లు, ప్రతి జంక్షన్లో నాలుగైదో హోటళ్లు, రెస్టారెంట్లు వెలిసినయి. పెద్ద సిటీల్లో ఆన్లైన్ఫుడ్ డెలివరీ యాప్స్లో లక్షల కొద్దీ ఆర్డర్లు వస్తున్నయి.ఒక్క మన రాష్ట్రంలోనే పొద్దున చాయ్‌‌‌‌ నుంచి రాత్రికి బిర్యానీ దాకా బయటి ఫుడ్ కోసం రోజుకు రూ.80 కోట్ల నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెడుతున్నరు. ఏడాదికి రూ. 35 వేల కోట్ల దాకా తినేస్తున్నరు. ఈ బయటి తిండి అలవాటు ఏటేటా పెరుగుతున్నదని.. ఇండియాలో బయటి ఫుడ్తినడం 2018తో పోలిస్తే 2019లో ఐదింతలు ఎక్కువైందని ఇటీవల ‘డైన్ ఔట్ పేరుతో విడుదలైన ఓ సర్వే స్పష్టం చేసింది. 
బయట ఫుడ్డే బెస్ట్...

శని ఆదివారాల్లో బయటికి వెళ్లి తినడం ఓ ఫ్యాషన్‌‌‌‌గా మారింది. ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు బిజినెస్ చేసుకునేవాళ్లు, దుకాణాల వాళ్లూ ఈ రెండు రోజులు ఇండ్లలో వంటలు బంద్ పెట్టేశారు. సినిమాలకో, పార్కులకో, షాపింగ్‌‌‌‌కో పోయి సేద తీరడం, కొత్త కొత్త హోటళ్లు, రెస్టారెంట్లను వెతుక్కుని మరీ ఫుడ్ టేస్ట్చేయడం పెరిగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పెద్ద సిటీల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద సిటీలతోపాటు చిన్న టౌన్ల వరకు కర్రీ పాయింట్లు వేల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. 15, 20 వెరైటీల కర్రీలను అమ్ముతుండటంతో జనం వాటి వెంట పడుతున్నారు.మధ్యాహ్నం తక్కువ ధరకే భోజనం అందించే టెంపరరీ దుకాణాలు, లంచ్ బండ్లు బాగా పెరిగాయి. 50 నుంచి 100 మందికి సరిపోయేలా ఇంటి వద్దే వండుకుని, జనాలు ఎక్కువగా ఉండే చోట ‘లంచ్‌‌‌‌ అడ్డా’లు పెడ్తున్నారు. ఆఫీసులు, ఆటో స్టాండ్లు, లేబర్ అడ్డాలు, మార్కెట్లలో ఈ లంచ్ అడ్డాలకు మస్తు డిమాండ్ ఉంది. రూ.40 నుంచి రూ. 60 వరకు వెజ్‌‌‌‌ మీల్స్, ఇంకో పదీ ఇరవై ఎక్కువ రేటు పెట్టి చికెన్ తో మీల్స్ పెడ్తున్నారు. హైదరాబాద్తోపాటు పెద్ద జిల్లా కేంద్రాల్లో రూముల్లో ఉండి చదువుకునే స్టూడెంట్లు, ఉద్యోగులు ఈ లంచ్ అడ్డాల్లో తింటున్నారు.స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ వంటి ఆన్‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌‌‌‌ కారణంగా బయటి ఫుడ్‌‌‌‌ను జనాలకు మరింత దగ్గరైంది. బుక్ చేసిన అరగంటలోనే ఫుడ్ను ఇంటికే తెచ్చిస్తుండటంతో చాలా మంది దీనికి అలవాటవుతున్నరు. ఒక్క హైదరాబాద్‌‌‌‌లోనే రోజుకు సగటున ఆరేడు లక్షల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ ఆర్డర్లు వస్తున్నయి. వరంగల్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వంటి టౌన్లలోనూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక చిన్న పట్టణాల్లోనూ రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు హోం డెలివరీ అందుబాటులోకి తెచ్చారు. కాల్ చేసిగానీ, వాట్సాప్లోగానీ ఆర్డర్ చేస్తే.. ఇంటికే ఫుడ్ తెచ్చిస్తున్నారు.