ఈ ఏడాది నీళ్లు ఇచ్చే దిశగా రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి పంప్ హౌస్, సర్జ్ ఫూల్ ఫుల్ పనుల జాప్యం పై అధికారులపై అగ్రహం కాలువల ద్వారా ప్రతి పల్లె చెరువులు, కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందించాలి. కాలువలకు ఇరువైపులా మూడు వరసలు మొక్కలు నాటాలి. అంతగిరి రిజర్వాయర్ పనుల పై 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిపిన మంత్రి హరీశ్ రావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ ఏడాది నీళ్లు ఇచ్చే దిశగా రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి పంప్ హౌస్, సర్జ్ ఫూల్ ఫుల్ పనుల జాప్యం పై అధికారులపై అగ్రహం కాలువల ద్వారా ప్రతి పల్లె చెరువులు, కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందించాలి. కాలువలకు ఇరువైపులా మూడు వరసలు మొక్కలు నాటాలి. అంతగిరి రిజర్వాయర్ పనుల పై 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిపిన మంత్రి హరీశ్ రావు

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (way2newstv.com)
అంతగిరి రిజర్వాయరు ద్వారా ఈ ఏడాది నీళ్లు ఇచ్చే దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇల్లంతకుంట లోని ప్రతిమ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-10 రాజన్న సిరిసిల్లా జిల్లా-సిద్ధిపేట జిల్లాలకు అనుసంధానంగా ఉన్న అంతగిరి రిజర్వాయరు పనుల పురోగతి పై రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, డీఆర్వో శ్యామ్ ప్రసాద్ లాల్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాంలతో 5 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రిజర్వాయరు క్షేత్రస్థాయి పనుల పురోగతి పై అధికారులు, ఏజెన్సీలను ఆరా తీశారు. టన్నెల్ విస్తరణ, లైనింగ్ పనులు ఈ యేడాదిలోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను సమన్వయం చేసుకుని పనులు తొందరగా పూర్తి చేసేలా చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
 
 
ఈ ఏడాది నీళ్లు ఇచ్చే దిశగా రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి
పంప్ హౌస్, సర్జ్ ఫూల్ ఫుల్ పనుల జాప్యం పై అధికారులపై అగ్రహం
కాలువల ద్వారా ప్రతి పల్లె చెరువులు, కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందించాలి.
కాలువలకు ఇరువైపులా మూడు వరసలు మొక్కలు నాటాలి.
అంతగిరి రిజర్వాయర్ పనుల పై 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిపిన మంత్రి హరీశ్ రావు
 
అంతగిరి రిజర్వాయరు పంప్ హౌస్, సర్జ్ పూల్ పనుల జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల ద్వారా ప్రతి పల్లె చెరువులు, కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన, కుడి, ఎడమ కాలువలకు ఇరువైపులా హరిత హారంలో భాగంగా కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకుని మొక్కలు నాటాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్, లైనింగ్, గేట్లు పనుల పురోగతి పై ఆరా తీస్తూ.. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ఆర్అండ్ ఆర్ కాలనీల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు సూచించారు. అంతగిరి రిజర్వాయరు పనులలో భాగంగా ఇరిగేషన్ అధికారి సమర సేన పనితీరును మంత్రి అభినందించారు.  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు సూచించారు. ఈ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఈఈ రవీందర్ రెడ్డి, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.