విజయవాడ, ఆగస్టు 21, (way2newstv.com)
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినా కనీసం ఒక్క సీటు కూడా రాదు అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాని ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసినా ఓడిపోతారని ఈ ఎంపీ వ్యాఖ్యానించడం విశేషం. అతి విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని టీవీ చానల్ ప్రతినిధి అడిగినా... అలా ఏం కాదని, తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసని, తన అంచనాలు తప్పవని ఈ ఎంపీ చెప్పుకొచ్చారు.
జనసేనకు ఒక్క సీటు రాదు : కేశినేని నాని