కరుణానిధి మృతికి గౌరవ సూచకంగా పార్లమెంట్‌ను వాయిదా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణానిధి మృతికి గౌరవ సూచకంగా పార్లమెంట్‌ను వాయిదా

న్యూఢిల్లీ ఆగష్టు 8(way2newstv.com)
డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి గౌరవ సూచకంగా పార్లమెంట్‌ను బుదవారం వాయిదా వేశారు. కరుణ కరుణానిధి.. రాజ్యసభ లేదా లోక్‌సభకు ఎప్పుడూ ఎంపిక కాలేదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఉభయ సభలు.. ఒక మాజీ సీఎం మృతి పట్ల పార్లమెంట్‌ను వాయిదా వేయడం ఇదే మొదటిసారి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ శాఖ మంత్రి అనంత్ కుమార్, ఇతర ఫ్లోర్ లీడర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశరాజకీయాల్లో కరుణానిధి ఓ గొప్ప నేత అని, ఆయన మృతికి నివాళిగా పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు కమిటీ పేర్కొన్నది.
 
 
 
కరుణానిధి మృతికి గౌరవ సూచకంగా పార్లమెంట్‌ను వాయిదా