కరుణానిధి పార్థివదేహనికి ప్రధాని మోదీ నివాళ్ళు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప్రధాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణానిధి పార్థివదేహనికి ప్రధాని మోదీ నివాళ్ళు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప్రధాని

చెన్నై ఆగష్టు 8 (w2newstv.comay)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన మోదీ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఎంకే స్టాలిన్,కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుదవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్,సీఎం పళనిస్వామి,డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు స్వాగతం పలికారు. చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ ఉదయం చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. 
 
 
 
కరుణానిధి పార్థివదేహనికి ప్రధాని మోదీ నివాళ్ళు
        ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప్రధాని
 
రాజాజీ హాల్‌కు వెళ్లి అక్కడ కరుణ పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత స్టాలిన్‌, కనిమొళిని పరామర్శించారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి.. మంగళవారం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ‘భారత రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్‌ నేత కరుణానిధి. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆలోచనాపరుడు, మాస్‌ లీడర్‌, గొప్ప రచయితను మనం కోల్పోయాం. ప్రజల సంక్షేమం కోసమే ఆయన తన జీవితాన్ని అంకింతం చేశారు. ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాకుండా జాతీయ పురోగతి కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. తమిళుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారు. తమిళుల గొంతును సమర్థంగా వినిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పలు సందర్భాల్లో కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ప్రజాస్వామ్య ఆదర్శాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సాంఘిక సంక్షేమానికి ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. తమిళనాడుతో పాటు భారత్‌ ఓ గొప్ప నేతను కోల్పోయింది’ అని మోదీ నిన్న ట్వీట్‌ చేశారు.