9 వేల కోట్లు చెల్లిస్తాను..మహా ప్రభో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

9 వేల కోట్లు చెల్లిస్తాను..మహా ప్రభో

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15, (way2newstv.com)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  ప్రముఖ లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అనూహ్య రీతిలో కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా విజయ్ మాల్యాను ప్రస్తావిస్తూ ప్రధాని లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలకు ట్విటర్ వేదికగా కౌంటర్ విసిరారు. నిజంగా ప్రజా నిధలను వసూలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రధానికి ఉంటే.. తాను చెల్లిస్తానని చెప్పిన డబ్బు తీసుకోవాలని భారత బ్యాంకులను ఎందుకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ తరపును బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లించేస్తానంటూ ట్విటర్లో ఇవాళ ఆయన వరుస పోస్టులు పెట్టారు. ప్రధాని మోదీ చేసిన బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ విజయ్ మాల్యా గురించి పరోక్షంగా ప్రస్తావించింది.


9 వేల కోట్లు చెల్లిస్తాను..మహా ప్రభో

మాల్యా ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘పార్లమెంటులో ప్రధానమంత్రి చివరి ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. ఆయన కచ్చితంగా మంచి మాటకారి. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి ‘‘పరారయ్యాడు’’ అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. మీడియా చెబుతున్న దాన్ని బట్టి అది నా గురించేనని నాకర్థమైంది...’’ అని పేర్కొన్నారు. నిజంగా ఈ ప్రజాధనాన్ని వసూలు చేయాలని ఉంటే... తాను చెల్లిస్తానన్న సొమ్మును తీసుకోవాలని బ్యాంకులకు ప్రధానమంత్రి ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘కనీసం కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన ప్రభుత్వ నిధులను పూర్తిగా వసూలు చేసేందుకైనా ప్రధాని ఎందుకు ముందుకు రావడంలేదు? ఆ సొమ్మును తీసుకోమని బ్యాంకులకు ఎందుకు చెప్పడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. అప్పులు కట్టేస్తానని కర్నాటక హైకోర్టు ముందు కూడా ఆఫర్ చేశానని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ‘‘దీన్ని చిన్న విషయంలా తీసిపారెయ్యెద్దు. ఇది నేను స్పష్టంగా, నిజాయితీగా, నిష్కపటంగా చెబుతున్న మాట. అయితే ఇప్పుడు బంతి వేరే కోర్టులో ఉంది. వెంటనే బాకీ చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయినా కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన డబ్బును బ్యాంకులు ఎందుకు స్వీకరించడం లేదు.?’’ అని ఆయన ప్రశ్నించారు. తాను అక్రమంగా ఆస్తులు దాచుకున్నట్టు ఈడీ చెబుతున్న విషయం మీడియా ద్వారా తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యానని విజయ్ మాల్యా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఒకవేళ దాచిన సొమ్ము అంటూ ఏదైనా ఉంటే రూ.14 వేల కోట్ల ఆస్తులను నేను బహిరంగంగా కోర్టు ముందు ఎందుకు పెడతాను? ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. అయినా నాకిది పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు...’’ అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అమల్లోకి తెచ్చిన పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద... ‘‘పరారీ ఆర్థిక నేరగాడి’’ (ఎఫ్ఈవో)గా ప్రకటించిన తొలి వ్యక్తి విజయ్ మాల్యానే. రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేతపై విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన 2016 మార్చి 2న దేశం విడిచి లండన్ పారిపోయారు. కింగ్‌ఫిష‌ర్‌కు ఇచ్చిన రుణాల‌ను బ్యాంకులు ఎందుకు వెన‌క్కి తీసుకోవ‌డం లేద‌ని మాల్యా ప్ర‌శ్నించారు. త‌న వ‌ద్ద ర‌హ‌స్య ఆస్తులు ఉన్నాయ‌ని కొన్ని మీడియా సంస్థ‌లు ఆరోపిస్తున్నాయని, అదే నిజం అయితే కోర్టు ముందు 14వేల కోట్ల విలువైన ఆస్తుల‌ను ఎందుకు స‌మ‌ర్పిస్తాన‌న్నారు.మాల్యా ప్ర‌శ్న‌ల వ‌ర్షం నేప‌థ్యంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది? ఆయ‌న‌కు అప్పులు ఇచ్చిన బ్యాంకుల వైఖ‌రి ఏంటి? ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎప్పుడు మాల్యాను స్వ‌దేశానికి తీసుకురానున్నాయి? అనేది తేలాలంటే..మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!