రోజు రోజుకు మారుతున్న బంగారం ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోజు రోజుకు మారుతున్న బంగారం ధరలు

ముంబాయి, ఫిబ్రవరి 23 (way2newstv.com)  
ఒక రోజు పెరగడం.. మరో రోజు తగ్గడం.. బంగారం ధరల విషయంలో ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. శుక్రవారం తగ్గిన బంగారం ధర శనివారం పెరిగింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.34,590కు చేరింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం కారణంగా బంగారం ధరలు పైకి కదిలాయని ట్రేడర్లు పేర్కొంటున్నారు. అదేసమయంలో అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ బలంగా ఉందని తెలిపారు. బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. 


రోజు రోజుకు మారుతున్న బంగారం ధరలు

కేజీ వెండి ధర రూ.140 పెరుగుదలతో రూ.41,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,328.90 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ధర ఔన్స్‌కు 16 డాలర్ల వద్ద క్లోజయ్యింది. ఫ్యూచర్స్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,330.65 గరిష్ట స్థాయిని కూడా తాకింది. కాగా దేశీ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర రూ.330 తగ్గిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.34,590కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.34,440కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి ధర రూ.140 పెరుగుదలతో రూ.41,500లకు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.110 పెరుగుదలతో రూ.40,268కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.83,000 వద్ద, అమ్మకం ధర రూ.84,000 వద్ద కొనసాగుతోంది.