వారిద్దరి భేటీ కారణాలు చెప్పాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారిద్దరి భేటీ కారణాలు చెప్పాలి

అమరావతి  ఫిబ్రవరి 23  (way2newstv.com
వైసీపీ  అధినేత జగన్మోహన్ రెడ్డి, లండన్ లో విజయ్ మాల్యాను కలవడానికి గల కారణాలను వెల్లడించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన రూ.43000 కోట్ల నల్లధనాన్ని, విజయ్ మాల్యా సాయంతో హవాలా రూపంలో ఏపీకి తరలించి ఎన్నికల్లో ఓటుకు రూ.10000 ఇచ్చి గెలవాలని చూస్తున్నారని బుద్దా విమర్శించారు. దీనిపై ప్రతిపక్ష నేత నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


వారిద్దరి భేటీ కారణాలు చెప్పాలి

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే, అక్కడి టీడీపీ సానుభూతిపరులను కిడ్నాప్ చేసి రౌడీ రాజకీయాలు చేస్తున్నా ఆపార్టీ అధినేత నోరు మెదపడం లేదని బుద్దా దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో అనేకమందిపై ఐటీ దాడులు జరుగుతుంటే, ఒక్క వైసీపీ నేతపై కూడా ఐటీ దాడులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గోవాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చూస్తున్న బీజేపీ, ఏపీకి ఎందుకు హోదా ఇవ్వడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. హోదా ఇవ్వకుండా ఏపీలో  మీటింగులకు ప్రధాని మోదీ ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నుతున్నారని బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. టీడీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ నేత పురందేశ్వరి, టీఆర్ ఎస్ నేత సంతోష్ రెడ్డి, వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి, సినీనటుడు మోహన్ బాబు మద్రాసులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో సమావేశం అయ్యారని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. దీనిపై వారిలో ఎవరైనా స్పందించాలని లేదంటే ఆధారాలు బయటపెడతామని ఆయన హెచ్చరించారు.