రెండో కుమారుడ్ని సైన్యానికి పంపిస్తా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండో కుమారుడ్ని సైన్యానికి పంపిస్తా

పాట్నా ఫిబ్రవరి 15  (way2newstv.com
పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్‌కు చెందిన జవాన్లు కూడా ఉన్నారు. భాగల్‌పూర్‌కు చెందిన రతన్ ఠాకూర్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు చనిపోయాడన్న విషయాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. 


 రెండో కుమారుడ్ని సైన్యానికి  పంపిస్తా

దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందంటూ తన చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. ‘నా కొడుకు దేశం కోసం, భరతమాత కోసం ప్రాణాలర్పించాడు. ఓ తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.. ఓవైపు బాధను దిగమింగుతూనే.. మరోవైపు గర్వంగా ఉన్నా. నా కొడుకు వంటి ఎందరో జవాన్లను చంపి.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి. దాయాది దేశానికి తగిన గుణపాఠం చెప్పడానికి తన రెండో కుమారుడ్ని కూడా సైన్యంలోకి పంపిస్తా’అంటూ భావోద్వేగానికి గురయ్యారు.