సిద్దిపేట, ఫిబ్రవరి12 (way2newstv.com)
కలపవృత్తి పనిచేసుకునే వారిపై , కార్ఖానాలపై అటవిశాఖ అధికారులు దాడులు, వేదింపులు మానుకోవాలని ఏపి,తెలంగాణ రాష్ట్రవిశ్వకర్మ యువజన హక్కుల పోరాట సమితి అద్యక్షుడు కందారపు రమేశాచార్యులు డిమాండ్ చేశారు. మంగళవారం సామిల్ల యాజమాన్యం,వడ్రంగి కార్మికులు చేపట్టిన దోళన కార్యక్రమానికి మద్దతునిస్తూ మాట్లాడారు.
అటవి శాఖ అధికారులు దాడులు మానకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం
రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కారగమిక వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపి ప్రభుత్వం వడ్రంగి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే రాష్ట్రసాధనలో భాగస్వామ్యమైన వడ్రంగులను తెగాణ ప్రభుత్వం చిన్నచూపుచూస్తుందన్నారు. వడ్రంగుల దూగడ మిషన్లను అధికారులు ,సిబ్బంది ఎత్తుకెళ్లడం రాజ్యంగా విరుద్దమన్నారు. వనసంరక్షణవ పేరిట డ్రంగులను వేధింపులకు గురుచేయడం పద్దతికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం పునరాలోచించాలని లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.