జగిత్యాల మార్చి 7 (way2newstv.com)
జిల్లా లోని మేడిపల్లి మండలంలోని కల్వకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు ,గుర్తింపు తీసుకురావాలని ఉపాధ్యాయులు సందేశమిచ్చారు.
టెన్త్ విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు
మంచి ఫలితాలు సాధించడం ద్వారా బడికి గుర్తింపు తీసుకురావడంలో ఆదర్శంగా ఉంటామని పదోతరగతి విద్యార్థులు వెల్లడించారు. ఈకార్యక్రమం గ్రామ సర్పంచ్ హనుమక్క ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజీపాష ,విద్యార్థిని ,విద్యార్థులు ,ఉపాద్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.