ప్రవేటు బస్సు దగ్గం..ప్రయాణికులు సురక్షితం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రవేటు బస్సు దగ్గం..ప్రయాణికులు సురక్షితం


కర్నూలు, జూన్ 6, (way2newstv.com)
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వెనువెంటనే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సు క్షణాల్లో కాలిబూడిదైంది. ఘటన జరిగినప్పుడు బస్సులో 53 మంది ప్రయాణికులు వున్నారు. 


ప్రవేటు బస్సు దగ్గం..ప్రయాణికులు సురక్షితం
వీరంతా సకాలంలో మంటలను గుర్తించి డ్రైవర్ను అలెర్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో వాళ్లు బస్సు దిగిపోయారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు కర్నూలు హైవేపై ఉన్న ఏనుగుమర్రి దగ్గరకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సులో అగ్నిప్రమాదం వలన ఒక వైపు ట్రాఫిక్ స్తభించిపోయింది. ఘటనపై స్థానికులు  పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.