అంగరంగవైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంగరంగవైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

హైదరాబాద్ జూలై 9 (way2newstv.com)
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఇవాళ అంగరంగవైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. 
అంగరంగవైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఎల్లమ్మ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.