లాభాల్లో మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లాభాల్లో మార్కెట్లు

ముంబై, జూలై 15 (way2newstv.com
దేశీ స్టాక్‌మార్కెట్ ఈ వారాన్ని ఘనంగానే ఆరంభించింది. బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్‌ను ఆదుకుంది. కంపెనీ అదిరిపోయే క్యూ1 ఆర్థిక ఫలితాలు ఇందుకు కారణం. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలను 8.5-10 శాతానికి పెంచడం ఇన్వెస్టర్లను మెప్పించింది. చివరకు సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 38,897 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,588 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్‌ లాభాల్లో నిలిచేందుకు దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. 
మార్కెట్ హైలైట్స్.. 
లాభాల్లో మార్కెట్లు

✺ నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, యూపీఎల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్ ఏకంగా 7 శాతానికి పైగా పరుగులు పెట్టింది. 
✺ అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2 శాతానికి పైగా పడిపోయింది. 
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 2.5 శాతం పతనమైంది. నిఫ్టీ ఇండెక్స్ 2.8 శాతం పరుగులు పెట్టింది. 
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.57 శాతం పెరుగుదలతో 67.08 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.35 శాతం పెరుగుదలతో 60.42 డాలర్లకు చేరింది. 
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 13 పైసలు లాభంతో 68.55 వద్ద కొనసాగుతోంది.