దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి: కేటీఆర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 22  (way2newstv.com)  
దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి. ఈ నెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్‌ చెప్పారు. 
దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి: కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్‌ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో గజ్వేల్‌, వర్ధన్నపేట ముందు వరుసలో నిలిచాయి. రాష్ట్రంలో బీజేపీకి 12 లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే బలమైన పార్టీ ఏదీ లేదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.