ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు

సింగరేణి బోనస్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ సెప్టెంబర్ 19  (way2newstv.com)
రాష్ట్రంలో అతిముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. కొత్త బొగ్గు బావులను ఏర్పాటు చేస్తూ లాభాలు గడిస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. 2019 -20 సంవత్సరానికి లాభాలు సాధించింది. లాభాలలో వాటా కార్మికుల కు అందజేయడం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం సింగరేణి ప్రాంత తెరాస ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ లో మాట్లాడారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ఈసారి వచ్చిన లాభాలను కార్మికుల కు పంచాలని సభలో సీఎం కెసిఆర్ గారు వెల్లడించడం జరిగింది. మా కార్మికుల పక్షాన మా తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలని అన్నారు. అన్ని కార్మిక సంఘాల తరపున ధన్యవాదాలు తెలిపారు. 
 ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు

ఒక్కో కార్మికునికి 1 లక్ష 899 రూపాయలు ఇస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. ఈ లాభాలను దసరా పండగ సందర్భంగా ఇవ్వటం సంతోషంగా ఉంది .ఇప్పటికే గనుల లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణ కు కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థ మొదటి నుండి మంచి పనులు చేస్తూ పోతోంది. తెలంగాణ బిడ్డనే సింగరేణి సంస్థ కు డైరెక్టర్ గా నియమించారు. సింగరేణి సంస్థ లో లాభాలు గతం కంటే ఎక్కువ వచ్చాయి. అందుకు అనుగుణంగా ఇవ్వాళ లాభాల వాటాను 28 శాతం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సభలో వెల్లడించారని అన్నారు. దసరా పండగ ఈ రోజే వచ్చినట్లు అనిపిస్తోంది. ఒక్కో సింగరేణి కార్మికునికి 1 లక్ష 899 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేసిన ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు హాయం లో డిపెండెంట్ ఉద్యోగాలు తీసివేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అవి పునరుద్ధరణ చేశారు కానీ కొంత మంది కోర్ట్ కు పోతే మళ్ళీ కారుణ్య ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు జబ్బులు వస్తే హైదరాబాద్ లో ఉన్న కార్పోరేట్ దవాఖాన కు వచ్చే వెసులుబాటు కల్పించారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ .అంతేకాదు సింగరేణి కార్మికులకు అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆరని అయన అన్నారు.