లబ్దిదారులను గుర్తించాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లబ్దిదారులను గుర్తించాం

అమరావతి అక్టోబర్ 18  (way2newstv.com)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం.  ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 20 లక్షల 50 వేల లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 8.5 లక్షల మందిని గుర్తించాం. పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల మందిని గుర్తించాం. 
లబ్దిదారులను గుర్తించాం

సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షలకుపైగా గుర్తించాం. ఇంకా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీ ఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం 19 వేల ఎకరాలు రూరల్ లో గుర్తించాం. పట్టణాల్లో 2500 ఎకరాలు గుర్తించాం. ఇంకా 19 వేల ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. దాదాపు 10 వేల కోట్లతో భూమిని సమీకరిస్తాం. ఒకే సారి ఇన్ని లక్షల పట్టాలివ్వడం దేశంలో ఇదే మొదటిది అవుతుంది. సీ ఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రికార్డు సాధిస్తారని అయన అన్నారు.