పడిపోతున్న బంగారం ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పడిపోతున్న బంగారం ధరలు

ముంబై, నవంబర్ 9 (way2newstv.com)
పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గింది. దీంతో ధర రూ.39,650కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.230 తగ్గింది. దీంతో ధర రూ.36,350కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా పడింది. రూ.150 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,600కు పడిపోయింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది. 
పడిపోతున్న బంగారం ధరలు

దీంతో ధర రూ.38,370కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గుదలతో రూ.37,100కు దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.150 క్షీణించింది. దీంతో ధర రూ.48,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 1,459.60 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 1.44 శాతం క్షీణతతో 16.76 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.