పోర్టుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోర్టుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి డిసెంబర్ 18, (way2newstv.com):
ముఖ్యమంత్రి  క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం  వైయస్.జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. దుగ్గజరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికల తయారీకి సీఎం ఆదేశాలు జారీ చేసారు. మొదటి  ఫేజ్‌లో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం పై, చర్యలు తీసుకోవాలంటూ అధికారులను  ఆదేశించారు. మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలి. ఈ పోర్టుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉంది. మిగిలిన పోర్టులు నిర్మాణం చేసేచోట అవసరమైన భూమిని వెంటనే సేకరించుకోవాలని అన్నారు.  
పోర్టుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష

మచిలీపట్నం పోర్టుకు వచ్చే జూన్‌నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేస్తామనిఅధికారులుసీఎంకు తెలిపారు. రామాయపట్నం పోర్టుకు వచ్చే జూన్‌నాటికి ఫైనాన్షియల్‌క్లోజర్ పూర్తిచేస్తామన్న అధికారులు, మే, జూన్‌నాటికి రెండు పోర్టులకూ శంకుస్థాపన జరపవచ్చని అన్నారు. విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం చెప్పింది. ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి ఇప్పించుకునేలా చర్యలు చేపట్టాలని  సీఎం అన్నారు. ఎవరైనా మీ ప్రాధాన్యతలు ఏంటని అడిగితే నా తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు– నేడు కార్యక్రమం అని చెప్తానని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత ఇళ్ల నిర్మాణం, ప్రతి ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది రెండో ప్రాధాన్యత అంటాను. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ మూడో ప్రాధాన్యత. పోలవరం ఎడమ కాల్వద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరో ప్రాధాన్యత. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడనుంచి బనకచర్లకు గోదావరి జలాలు మరో ప్రాధాన్యత. ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాన్న వాటర్ గ్రిడ్ మరో ప్రాధాన్యతని అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉంటుంది. అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుంది. నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని అయన అన్నారు.విద్యుత్‌సంస్కరణల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నాం. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు ఇస్తే సరిపోతుంది. సుమారు రూ. 35–37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అంటే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. ఈదిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.