హిందూ దేవాలయంలో విగ్రహాల విధ్వంస కేసులో నలుగురు అరెస్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హిందూ దేవాలయంలో విగ్రహాల విధ్వంస కేసులో నలుగురు అరెస్టు

న్యూ ఢిల్లీ జనవరి 28 (way2newstv.com)
;సింధ్ ప్రావిన్స్‌ లోని జిల్లాలోని చాచ్రో ప్రాంతంలోని హిందూ దేవాలయంలో జరిగిన విగ్రహాల విధ్వంస సంఘటనకు సంబంధించి నలుగురు మైనర్ బాలులను తార్‌పార్కర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.డబ్బు దొంగిలించడానికి నలుగురు మైనర్ లు మాతా రాణి భితియాని ఆలయంలోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు.స్థానిక నివాసి ప్రేమ్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని నలుగురిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఆలయం లోకి ప్రవేశించిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ధ్వంసం చేశారు, వారు దేవతల విగ్రహాలను కూడా అపవిత్రం చేశారు.
హిందూ దేవాలయంలో విగ్రహాల విధ్వంస కేసులో నలుగురు అరెస్టు

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో ఈ సంఘటనను అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించారు.డిఐజి మీర్పుర్ఖాస్ మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు జరగకుండాఆ చూడటానికి పోలీసులు రేంజర్లను ఈ ప్రాంతంలో నియమించామని, ఈ చర్యకు పాల్పడిన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.కాగా ఈ సంఘట హిందువులపై విద్వేషం తో దేవత విగ్రాహాలను ద్వాంసం చేశారని అభియోగాలు ఉండాగా అక్కడి అధికారులు దొంగ తనం కేసు గా మార్చడానికి యత్నిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.