ముంబై, అక్టోబరు 10, (way2newstv.com)
కోటీశ్వరులు కావడం ఎలా? ఇది అందరికీ ఉండే ప్రశ్ననే. అయితే సమాధానం మాత్రం ప్రతి ఒక్కరికీ తెలియకపోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా ఇదే వర్తిస్తుంది. మార్కెట్నిపుణులు 15 ఏళ్ల పాటు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలని రిటైల్ ఇన్వెస్టర్లకు సలహాలు ఇస్తుంటారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు సిప్ రూపంలో మార్కెట్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు.స్టాక్ మార్కెట్లోని అన్ని షేర్లు ఒకే పనితీరు కనబర్చవు. కొన్ని స్టాక్స్ పడిపోతే మరికొన్ని పరుగులు పెడుతూ ఉంటాయి. ర్యాలీ చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు. అలాంటి ఒక స్టాక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్. 2001లో చాలా మంది ప్రభుత్వ బ్యాంకుల్లో కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపారు.
2 లక్షలతో కోటిరూపాయిలు
దీనికి తగ్గట్టుగానేఆ బ్యాంకులు కూడా పనితీరు కనబర్చాయి.2001 అక్టోబర్ 9 నుంచి 2019 అక్టోబర్ 10 మధ్యకాలంలో హచ్డీఎఫ్సీ బ్యాంక్ అదిరిపోయే ర్యాలీ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరురూ.21.4 నుంచి రూ.1,200 స్థాయికి పరుగులు పెట్టింది. ఎవరైనా 2001 అక్టోబర్లో ఈ స్టాక్లో ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది రూ.56.07కు పెరిగేది.బ్యాంక్ ఇంకా పలుమార్లు డివిడెంట్ కూడా ఇచ్చింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మీరు 2001 అక్టోబర్లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు కోటీశ్వరులు అయ్యేవారు.ఇన్వెస్ట్మెంట్ల విలువ ఏకంగా రూ.1.12 కోట్లకు చేరేది. చూడండి రూ.2 లక్షలతో ఏకంగా రూ.1.12 కోట్లు వచ్చేవి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధరపై ఆర్కే గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్రాకేశ్ బన్సాల్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఐలు ఎప్పుడూ కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులకు అధిక ప్రాధాన్యమిస్తారని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ప్రత్యేకమైన స్థానంఉందన్నారు. ఇప్పటికీ కూడా ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక మహీంద్రా బ్యాంక్ బెస్ట్ ఛాయిస్గా కొనసాగుతున్నాయని వివరించారు. మీరు ఇప్పుడుకూడా కోటీశ్వరుల కావాలని భావిస్తే ఈ షేర్ల వైపు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:
all india news