నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై జూన్ 28 (way2newstv.com)   
అంత‌ర్జాతీయ ట్రేడ్ వార్ భ‌యాల‌తో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఈ ప్ర‌భావంతో ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగాయి. ఆ ప్ర‌భావం మన మార్కెట్ల‌పై ప‌డింది. మధ్యాహ్నం నుంచీ ఊపందుకున్న అమ్మకాల కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు దిగ‌జారి 35,217 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచి నిఫ్టీ 109 పాయింట్లు న‌ష్ట‌పోయి 10,656 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.89%), టీసీఎస్(0.38%), స‌న్ ఫార్మా(0.35%), కోల్ ఇండియా(0.19%)లాభాల బాట ప‌ట్ట‌గా సెన్సెక్స్ 30లో 26 కంపెనీలు న‌ష్ట‌పోయాయి. అత్య‌ధికంగా నష్ట‌పోయిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(3.16%), ఎల్ అండ్ టీ(2.71%), టాటా మోటార్స్(2.22%), ఎస్బీఐఎన్(2.10%), అదానీ పోర్ట్స్(1.75%), ప‌వ‌ర్ గ్రిడ్(1.75%) ముందున్నాయి.
 
 
 
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు