కర్నూలు, ఆగష్టు 28 (way2newstv.com)
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఆల్ఫా కాలేజ్ లో మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ వేడుకలుకు ఏర్పాట్లు భారీగా సిద్ధమౌతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ,టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున హాజరౌతున్నారు . భార్గవ రామ్లో బుధవారం ఉదయం 10:57నిమిషాలు కు భూమా అఖిల ప్రియ పరిణయం జరుగుతుంది. వివాహానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కర్నూలు జిల్లాఅడిషనల్ ఎస్.పి.వెంకటేశ్వర్లు అధర్వంలో బందోబస్తు వివాహానికి ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పి మీడియాతో మాట్లాడుతూ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇరురాష్టాల గవర్నర్ నరసింహన్ వివాహాన్ని హాజరు కానున్నారని అన్నారు. కార్యక్రమానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పెళ్లి ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి లు పరిశీలించారు.
అఖిల ప్రియా వివాహ ఏర్పాట్లు