సీఎం చంద్రబాబుతో ఇండియన్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎం చంద్రబాబుతో ఇండియన్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ

అమరావతి, ఆగష్టు 28 (way2newstv.com)  
ముఖ్యమంత్రి చంద్రబాబును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఉండవల్లిలో అయన  సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేరళ వరద బాధితులకు  సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14,83,336 ల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసారు. వితరణ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని విజ్జ్ఞప్తి చేసారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై భట్టాచార్య  హామీ ఇచ్చారు. సీం చంద్రబాబు ఆధ్వర్యంలో  ఏపీ శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య కితాబు నిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భట్టాచార్య హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 



 సీఎం చంద్రబాబుతో ఇండియన్ బ్యాంక్ డైరెక్టర్ భేటీ