మళ్లీ పెరిగిన బంగారం ధర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ పెరిగిన బంగారం ధర

ముంబై, సెప్టెంబర్ 17(way2newstv.com)
పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.410 పెరుగుదలతో రూ.39,510కు పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో రూ.36,260కు చేరింది. బంగారం ధర భారీగా పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.40పెరుగుదలతోరూ.48,800కు చేరింది. 
మళ్లీ పెరిగిన బంగారం ధర

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరుగుదలతో రూ.38,100కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.390 పెరుగుదలతో రూ.37,000కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర పెరిగింది. రూ.40 పెరుగుదలతో రూ.48,800కు చేరింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం తగ్గుదలతో 1,506.45 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.43 శాతం తగ్గుదలతో 17.95 డాలర్లకు క్షీణించింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.