రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

నెల్లూరు సెప్టెంబర్ 30, (way2newstv.com)
సోమవారం  ఉదయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు స్థానిక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన నెల్లూరు రూరల్ ప్రజలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా ఆరాధ్య నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఋణపడి ఉంటానని అన్నారు. అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అయన అన్నారు.
రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే