పరిగెడుతున్న పసిడి

ముంబై, సెప్టెంబర్ 24  (way2newstv.com)    
పసిడి ధర పరిగెడుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.39,380కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.70 పెరుగుదలతో రూ.36,100కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మరింత స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.50,071 వద్దనే నిలకడగా ఉంది. 
పరిగెడుతున్న పసిడి

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.38,100కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.100 పెరుగుదలతో రూ.36,900కు ఎగసింది. ఇకపోతే పసిడి ధర పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర మాత్రం స్థిరంగా రూ.50,071 వద్దనే ఉంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర కిందకు దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గుదలతో 1,528.25 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం క్షీణతతో 18.65 డాలర్లకు తగ్గింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Previous Post Next Post