కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ పనితీరుకు పదునుపెట్టాలి: గవర్నర్‌

హైదరాబాద్‌ డిసెంబర్ 27(way2newstv.com)
నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. 
కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ పనితీరుకు పదునుపెట్టాలి: గవర్నర్‌

కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ ప్రతిభ, పనితీరుకు పదునుపెట్టాలి. ఇంజినీరింగ్‌ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌.
Previous Post Next Post