తిరుపతి(way2newstv.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు 27వ తేదీ మంగళవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది.
ఆగస్టు 27న తిరుప తి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.
Tags:
Andrapradeshnews