బడి గంట తో పాటు నీళ్ల గంట మొగాలి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బడి గంట తో పాటు నీళ్ల గంట మొగాలి...

పాఠశాలల, కళాశాలల విద్యార్థులను గుణవంతులను తయారు చేయాలి...
- విద్యార్థుల్లో వైజ్ఞానికత ప్రతిభను వెలికి తీసే వేదిక వైజ్ఞానిక ప్రదర్శన...
- సిద్దిపేట లో రాష్ట్ర స్థాయి ఇన్ స్పెయిర్ కార్యక్రమం ఏర్పాటు కు కృషి చేస్తా...
సిద్దిపేట డిసెంబర్ 4 (way2newstv.com)
పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి పెట్టడం సబబు కాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే మంచి వేదిక అని అన్నారు...సీఎం కేసీఆర్ విద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. .
బడి గంట తో పాటు నీళ్ల గంట మొగాలి...

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది... విద్యార్థుల జిజ్ఞాసను తెలుసుకుని వారిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలి... ఏదైనా మనము నేర్చుకొనేది పాఠశాల స్థాయి నుండే ..ప్లాస్టిక్ నిషేధించాలి.. మొక్కలు నాటాలి అనే ఆలోచన రావాలి... బడిలో నీళ్ల గంట మొగాలి...పిల్లలు రోజుకు కనీసం.. రేపటి తరం తరగతి గదుల్లో తయారవుతాయన్న విషయం ఉపాద్యాయులు గుర్తించాలన్నారు. విద్యతో పాటు గుణవంతులుగా, సంస్కారులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలకు సామాజిక బాధ్యతను నేర్పాలన్నారు.సృజనాత్మక తకు వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలువిద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలను ఓ రూపంలోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి విషయ పరిజ్ఞానం పొందుతారని చెప్పారు.పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట తొలి స్థానం సాధించాలి.పదో తరగతి పరీక్షలు మార్చి 19 వ తేదీ నుంచి జరగనున్నాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుకు సిద్దమవ్వాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సిద్దిపేట ఈ దఫా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. వంద శాతం ఫలితాలు సాధించాలని, వంద మంది విద్యార్థులు పదికి పది మార్కులు సాధించాలన్నారు. ఈ దిశగా విద్యార్థులు, ఉపాద్యాయులు, జిల్లా విద్యా శాఖ అధికారులు పని చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది 99.3 శాతం సాధిస్తే ఇంటర్మీడియట్ లో కేవలం 43శాతం మాత్రమే ఉతీర్ణులవుతున్నారని చెప్పారు. దీనిపై ఇప్పటికే జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపానన్న మంత్రి హరీష్ రావు, కళాశాల లెక్చరర్లతోను సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలల్లో తప్పనిసరిగా నీళ్ల గంట కొట్టాలని ఆదేశించారు. కొండపాక జూనియర్ కళాశాలలోమద్యాహ్న బోజనం పెట్టించాలని మంత్రి స్థానిక నేతలకు సూచించగా అందుకు అంగీకరించారు.